*జర్నలిస్టులకు అండగా.. యాదాద్రి భువనగిరి ప్రెస్ (క్లబ్ )సోసైటీ* 

*జర్నలిస్టులకు అండగా.. యాదాద్రి భువనగిరి ప్రెస్ (క్లబ్ )సోసైటీ* 

జనంన్యూస్ /సెప్టెంబర్ 30 భువనగిరి టౌన్ యాదాద్రి భువనగిరి జిల్లా* 

ఆపదలో ఉన్న జర్నలిస్టులకు భవనగిరి ప్రెస్ (క్లబ్) సొసైటీ అండగా ఉంటుందని సొసైటీ ప్రధాన కార్యదర్శి గంధమల్ల రాజు, కోశాధికారి ఆరే కుమార్ అన్నారు. 

ఇటీవల అనారోగ్యానికి గురైన విలేకరులు దండు కృష్ణ, సుర్పంగ కుమార్ లకు సొసైటీ తరఫున ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రింట్ ఆండ్ ఎలక్ట్రానిక్ మీడియాలొ పనిచేస్తున్న జర్నలిస్టులు ఆపదలో ఉంటే సొసైటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రెస్ క్లబ్ అహర్నిశలు పనిచేస్తుందన్నారు. జర్నలిస్టులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి ప్రెస్ (క్లబ్) సొసైటీ కార్యవర్గ సభ్యులు కూరేళ్ల మల్లేశం,సొసైటీ సభ్యులు లక్ష్మీ నారాయణ, భువనగిరి కిషన్, గోపి మహేష్ , మొహమ్మద్.శానుర్ బాబా ,నిమ్మల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు